ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకి అండగా నిలిచిన ప్రభుత్వం వైసీపీ మాత్రమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 05:10 PM

గతంలో పెళ్ళి అంటే అప్పులు చేయాల్సి వచ్చేది, ఇప్పుడు మాత్రం మీరు గొప్ప ఆలోచనతో ముందుకు వెళుతున్నారని సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి  మేరుగు నాగార్జున అన్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వైయ‌స్ఆర్‌ కళ్యాణమస్తు, వైయ‌స్ఆర్‌ షాదీ తోఫా కార్య‌క్ర‌మంలో భాగంగా  వధువు తల్లుల ఖాతాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నగదు జమ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ....  ఈ రోజు సామాజిక ఎదుగుదలలో భాగంగా సీఎం జగన్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలతో పాటు, ఇదివరకు ఆగిపోయిన కాన్సెప్ట్‌ను మరలా వైయ‌స్ఆర్‌ కళ్యాణమస్తు, వైయ‌స్ఆర్‌ షాదీ తోఫా పేరుతో సాయం చేయడం, పైగా గతంలో కంటే ఎక్కువగా సాయం చేస్తున్నారు, దీంతో రాష్ట్రంలోని అనేకమంది పేదలు లబ్ధి పొందుతున్నారు, గతంలో పెళ్ళి అంటే అప్పులు చేయాల్సి వచ్చేది, ఇప్పుడు మాత్రం మీరు గొప్ప ఆలోచనతో ముందుకు వెళుతున్నారు. దీనిపై ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు కట్టుకథలు రాస్తున్నాయి, కానీ ఇది మూడో పర్యాయం సాయం చేస్తున్నాం, దీనిని గమనించాలి. సంక్షేమ పథకాలు కొనసాగించడం లేదంటున్నారు కానీ వారు వాస్తవాలు గుర్తించాలి. ఇది పేదలకు ఉపయోగకరం, దీనిపై వ్యతిరేక మాటలు మాట్లాడే వారికి దేవుడు మంచి ఆలోచనలు ఇవ్వాలి అని కోరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa