ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నులిపురుగుల నివారణని మందులు పంపిణీ చేసిన మంత్రి రజని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 10, 2023, 01:33 PM

మాట్లాడుతూ.. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టుతో పాటు, పలాసలో కిడ్నీ కేర్‌ సెంటర్‌ను త్వరలో అందుబాటులోకి తెస్తామని మంత్రి విడదల రజని చెప్పారు. పిడుగురాళ్ల, పులివెందులలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించనున్న నేపథ్యంలో, ఆయా చోట్ల టీచింగ్‌ ఆస్పత్రుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంత‌రం జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంత్రి రజిని పోస్టర్‌ను ఆవిష్కరించారు. గుంటూరులో నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa