ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే సంక్రాంతి తర్వాత టీడీపీ, జనసేన ఉండవంటూ,,,మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2023, 09:41 PM

ఏపీ రాజకీయాలు, వచ్చే ఎన్నికలపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సంక్రాంతి తర్వాత ఏపీలో రెండు రాజకీయ పార్టీలు ఉండవని జోస్యం చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు వచ్చే సంక్రాంతి తర్వాత ఉండవని, ఆ పార్టీలు ఉంటే తాను గుండు కొట్టించుకుంటానంటూ వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేయాలనే తపన టీడీపీ, జనసేనకు లేదని, ఎన్నికలు వచ్చినప్పుడే స్కీములు గుర్తుకొస్తున్నాయని తెలిపారు.


శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నిర్వహించిన సమావేశంలో బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేకుండా జగన్‌ను తిడుతూ పోతే ఎవరూ హర్షించరని తెలిపారు. ఉత్తరాంధ్రలో ప్రస్తుతం పర్యటిస్తున్న పవన్ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. చిత్తశుద్ది లేని టీడీపీ, జనసేనలు త్వరలో కనుమరుగైపోతాయని విమర్శించారు. ప్రజలనాడి తెలిసిన వ్యక్తిగా తాను ఈ విషయం చెబుతున్నానని, తన అనుభవంతో చెబుతున్నట్లు తెలిపారు. ఇదేదో గొప్ప కోసం తాను చెప్పడం లేదని, ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం ఉండే పార్టీలు మాత్రమే ఉంటాయన్నారు. టీడీపీ, జనసేనలకు అలాంటి ఉద్దేశమే లేదన్నారు.


జగన్‌ను తిట్టడమే టీడీపీ, జనసేన పని అంటూ బొత్స తెలిపారు. రుషికొండకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై కూడా బొత్స స్పందించారు. పవన్ మాట్లాడే గాలి మాటలకు కూడా తాము సమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు. పవన్ నోటికొచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa