ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీస్ పతకాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం,,,ఏపీ నుంచి 29 మందికి పతకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 14, 2023, 10:07 PM

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 954 మంది పోలీసులకు పోలీస్‌ సేవా పతకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 229 మందికి పోలీసు గ్యాలంటరీ పతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 642 మందికి పోలీసు సేవా పతకాలు ప్రకటించింది. తెలంగాణ నుంచి 34 మంది ఎంపికవ్వగా.. ఏపీ నుంచి 29 మంది పోలీసులకు పతకాలు దక్కాయి. ఏపీ నుంచి ఒక్కరికి రాష్ట్రపతి పోలీస్‌ విశిష్ఠ సేవా పతకం, 18 మందికి పోలీస్‌ గ్యాలంటరీ పతకాలు, 10 మందికి విశిష్ఠ సేవా పతకాలు లభించాయి.


ఏపీ ఎడిజీపి శంఖబ్రత బాఘ్చి, తెలంగాణ ఏడిజిపి విజయ్ కుమార్, ఎస్పీ మాదాడి రమణ కుమార్‌కు రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు దక్కాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందిన 22 మందికి పోలీస్‌ గ్యాలంటరీ, 10 మందికి పోలీస్‌ సేవా పతకాలు, మరో ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు లభించాయి. తెలంగాణ అదనపు డీజీ విజయ్‌ కుమార్‌, ఎస్పీ మాదాడి రమణ కుమార్‌లకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు దక్కాయి.


ఇక ఎస్పీ భాస్కరన్, ఇన్‌స్పెక్టర్లు శివప్రసాద్, పురుషోత్తంరెడ్డి, ఆర్ఐ రమేష్, ఎస్సై బండారి కుమార్, ఆర్ఎస్ఐలు మహేశ్, షేక్ నాగుల్ మీరా, హెడ్ కానిస్టేబుళ్లు ఆదినారాయణ, అశోక్ గ్యాలంటరీ పతకాలు పొందారు. ఇక గ్యాలంటరీ పతకాలు పొందిన వారిలో కాన్‌స్టేబుళ్లు సందీప్ కుమార్, కార్తీక్, మధు, సంపత్, దివంగత సుశీల్, సునీల్‌ కుమార్, సుకుమార్, కళ్యాణ్ కుమార్, శ్రీధర్, రవీంద్రబాబు, రాథోడ్ రమేష్, మహేందర్ రావు, శివకుమార్ ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa