ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకం సచివాలయాల ఉద్యోగులకు వర్తించనున్న సంగతి తెలిసిందే. సచివాలయాలతో పాటుగా వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పనిచేసే ఉద్యోగులకు సైతం ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్) అమలుకు చర్యలు తీసుకున్నామన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాది పొడిగించామని.. వ్యవసాయ మార్కెట్ కమిటీల ఉద్యోగులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామన్నారు. సెప్టెంబరు చివరి నాటికి అందరికీ ఈహెచ్ఎస్ (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్) కార్డులు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆరోగ్య పథకాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేస్తామన్నారు సీఎష్ జవహర్రెడ్డి. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు కలిపి సుమారు 22 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వారందరికీ హెల్త్కార్డులు అందించేలా కసరత్తు చేస్తున్నామన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి ప్రభుత్వ వాటా నిధులు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సకాలంలో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గుండె, కిడ్నీ, కేన్సర్ వంటి 10 ప్రధాన ప్రొసీజర్లకు ప్రస్తుతం ఇస్తున్న ప్యాకేజీ రేట్లను సవరించాల్సిన అవసరం ఉందని.. దానిపై తగిన ప్రతిపాదనలు సిద్ధంచేసి పంపాలని ఆరోగ్యశ్రీ సీఈవోను ఆయన ఆదేశించారు.
మెడికల్ రీయింబర్స్మెంట్ విధానాన్ని మరింత స్ట్రీమ్లైన్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు సీఎస్. గుండె జబ్బు రోగులకు కేంద్రం నిర్దేశించిన టాప్ బ్రాండ్ స్టంట్కే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని.. ఆ స్టంటే వేసేలా నెట్వర్క్ ఆసుపత్రులకు నిర్దేశిస్తామన్నారు. ఈహెచ్ఎస్ అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు వెంటనే సమావేశాలు నిర్వహించేలా ఆదేశిస్తామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులనూ ఈ పథకం కిందకి తీసుకొచ్చామన్నారు.
మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ సంక్షేమ కార్యదర్శులను ఎన్నికల బీఎల్వో (ఎన్నికల బూత్ లెవల్ ఆఫీసర్) ల విధుల నుంచి తప్పించాలని ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ చేసింది. ఓ వైపు సంక్షేమ పథకాల అమల్లో ఒత్తిడి ఎదుర్కొంటున్న సంక్షేమ కార్యదర్శులు.. మరో వైపు రాజకీయ నేతల ఒత్తిడిని కూడా తట్టుకోవాల్సి వస్తోంది అన్నారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు గుడి నాగరాజు.
బీఎల్వో బాధ్యతలు కారణంగా అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ఇద్దరు కార్యదర్శులను సస్పెండ్ చేశారన్నారు. వజ్రకరూర్ మండలంలో ఓ సంక్షేమ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. పని ఒత్తిడి తక్కువగా ఉన్న సచివాలయ సిబ్బందికి ఈ బాధ్యతలు అప్పజెప్పే అవకాశమున్నా.. అధికారులు సంక్షేమ కార్యదర్శులకే ఈ బాధ్యతలు ఎందుకు అప్పజెప్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం మరో సారి ఈ అంశంపై పునరాలోచించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa