సంక్షేమ పాలనలో, సామాజిక న్యాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని వైయస్ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది గతంలో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి, నేడు ఆయన తనయుడు సీఎం వైయస్ జగన్ అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ జీవించి ఉన్నంతకాలం మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని మరువలేరని చెప్పారు. టీడీపీ హయాంలో బడుగు, బలహీనవర్గాలకు చంద్రబాబు చేసింది శూన్యమని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa