ఉన్నతవిద్యలో ప్రపంచస్థాయి అత్యుత్తమ యూనివర్సిటీల సర్టిఫికెట్ కోర్సులను వైయస్ జగన్ ప్రభుత్వం ఉచితంగా అందించబోతోంది. ప్రఖ్యాత మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు కంపెనీ (MOOC) ఎడెక్స్తో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్తో ఎడెక్స్ వ్యవస్థాపకుడు, సీఈవో, పద్మశ్రీ అవార్డు గ్రహీత అనంత్ అగర్వాల్ సమావేశమయ్యారు. అనంతరం ఒప్పందంపై అనంత్ అగర్వాల్, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లను విద్యార్థులకు అందిస్తారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు, ఎడెక్స్ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa