టంగుటూరి ప్రకాశం పంతులు 152వ జయంతి వేడుకలు ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మల్లాది వెంకట సుబ్బారావు, సుందరమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... ఆంధ్రకేసరి అకుంఠిత ధైర్యసాహసాలు, పోరాట పటిమను భావితరాలకు తెలియజెప్పేలా నిర్వహించిన నాటక ప్రదర్శనలు, గీతాలాపనలు ఆకట్టుకొన్నాయి. నాటక రంగాన్ని బతికిస్తున్న కళాకారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా 1984లో తాను వేసిన నెహ్రూ పాత్రను గుర్తు చేసుకొన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంధ్రుల పాత్ర ఎంతో ఉందని, అందులో ఆంధ్రకేసరి ముందు వరుసలో ఉంటారన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ నగరంలో ప్రకాశం పంతులుకు విడదీయరాని బంధం ఉందని, 1952లో భారీ వరదలు వచ్చిన సమయంలో పార్లమెంటులో పోరాడి ప్రభుత్వ నిధులతో కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణానికి పూనుకొన్నారన్నారు. 1954న సీఏం హోదాలో బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో బ్యారేజీకి ఆయన పేరు పెట్టారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa