ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ సర్కార్‌కే ప్రజలు బుద్ధి చెబుతారు,,,నటుడు పృథ్వీరాజ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2023, 08:01 PM

వచ్చే ఎన్నికలపై జోస్యం చెప్పారు జనసేన నాయకుడు, సినీ నటుడు పృథ్వీరాజ్‌. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ పాలన అధ్వానంగా ఉందని విమర్శించారు. పృథ్వీరాజ్‌ సొంతంగా దర్శకత్వం వహిస్తూ రూపొందించిన కొత్త రంగుల ప్రపంచం సినిమా టీమ్ ఖమ్మం జిల్లా బోనకల్లు వెళ్లారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, వచ్చే ఎన్నికలపై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు కచ్చితంగా బుద్ది చెప్పడం ఖాయమన్నారు.


ఏపీలో 2024లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో జనసేన తన ప్రభంజనం సృష్టించబోతుందన్నారు పృథ్వీ. బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్రలో దర్శకుడు చెప్పినట్లు నటించాను తప్ప వేరే వాళ్ల గురించి తెలియదన్నారు. బోనకల్‌లో పృథ్వీరాజ్‌‌తో పాటుగా కొత్త రంగుల ప్రపంచం సినిమా యూనిట్ టీవీ ఆర్టిస్ట్‌ బానోత్‌ శ్రీనివాసరావు ఇంటికి అతిథులుగా వెళ్లారు. హీరోయిన్‌గా తన కుమార్తె శ్రీ, హీరోగా తన మిత్రుడి కుమారుడు క్రాంతి నటించారన్నారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa