ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారు పిరికి సన్యాసులు...నారా లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2023, 10:41 PM

వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా వైసీపీ నేతలు పిరికి సన్నాసులు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.  "ఇతర జిల్లాల్లో వైసీపీ కుక్కలు నా పాదయాత్ర పూర్తయిన తరువాత మొరిగేవి. కృష్ణా జిల్లా వైసీపీ కుక్కలు నేను జిల్లాలో అడుగుపెట్టకముందే ప్యాంట్లు తడుపుకున్నాయి" అంటూ ఎద్దేవా చేశారు. "లోకేశ్ క్షమాపణ చెప్పి జిల్లాలో అడుగుపెట్టాలి అని వైసీపీ కుక్కలు మొరిగాయి. అమ్మ లాంటి అమరావతిని చంపేసిన ఈ కుక్కలకు నన్ను ప్రశ్నించే హక్కు ఎవడిచ్చాడు? అంటూ లోకేశ్ మండిపడ్డారు. పుట్టిన గడ్డకి జగన్ అన్యాయం చేస్తుంటే చప్పట్లు కొట్టిన కుక్కలు మనకి నీతులు చెబుతున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa