ప్రజల భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికలలో టీడీపీని గెలిపించాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడు గ్రామంలో సుమారు 50 మంది దళిత యువకులు ఎస్సీ సెల్ నాయకులు మొకమాటి రాజు, మెప్పేల్లి అయ్యన్న.. ఎస్సీసెల్ మండల ఉపాధ్యక్షుడు వింజమూరి రాజు, కొండా వేణు ఆధ్వర్యంలో ఆదివారం టీడీపీలో చేరారు. వారికి గోరంట్ల కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... వైసీపీ నాలుగేళ్ల పాలనలో అంతా అవినీతిమయమేనని, దళితులను జగన్ నమ్మించి దగా చేశారన్నారు. దళిత సంక్షేమం, వారి పిల్లల భవిష్యత్ కోసం టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన 27 పథకాలను రద్దు చేశారన్నారు. విదేశాలకు వెళ్లే దళిత పిల్లల కోసం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విదేశి విద్యను జగనన్న విద్యాదీవెనగా పేరు మార్చుకున్న సిగ్గుమాలిన ప్రభు త్వం వైసీపీ ప్రభుత్వమని ధ్వజమెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa