కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలంలోని యాకమూరులో ఒక విచిత్ర సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... ..బొల్లెద్దు వెంకటేశ్వరరావు(34) సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో యాకమూరు వాటర్ట్యాంకు నుంచి నీరు వదిలేందుకు బైక్పై వెళుతున్నాడు. సాతులూరి కన్నబాబు పెంపుడు కుక్క వెంకటేశ్వరరావు వెంట పడింది. దీంతో బైక్ ఆపి దానిపైకి రాయి విసిరాడు. కుక్కని రాయితో కొడతావా అంటూ కన్నబాబు అతని తమ్ముడు వంశీ కలిసి వెంకటేశ్వరరావుని ప్రశ్నించారు. దీంతో మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. కన్నబాబు ఇనప పలుగు తెచ్చి వెంకటేశ్వరరావుపై దాడికి పాల్పడ్డాడు. దీంతో వెంకటేశ్వరరావు తలకు పెద్దగాయమైంది. వెంకటేశ్వరావును ఉయ్యూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై వెంకటేశ్వరరావు అన్న బొల్లెద్దు శేఖరబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్నబాబు సోదరులపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa