విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో మాస్టర్ ప్లాన్ మేరకు ఒకేసారి 2000 మంది భక్తులు భోజనాలు చేసేందుకు వీలుగా అన్నదాన భవనం, ప్రసాదం పోటుకు సెప్టెంబరు నెలలో శంకుస్థాపన చేయనున్నట్టు అలానే దుర్గాఘాట్లో భక్తులు స్నానాలు చేసేందుకు జలవనరుల శాఖ సహకారంతో ఘాట్లో పూడిక పనులు, దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు, నేరుగా నదిలో స్నానం చేసుకునే వీలు కల్పిస్తున్నామని ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. సీఎం జగన్మోహనరెడ్డి కేటాయించిన రూ. 70 కోట్ల నిధుల్లో రూ.5కోట్లతో మల్లేశ్వరాలయ పునర్నిర్మాణ పనులు చేపట్టామని, త్వరలో ప్రాంగణంలో విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రాత్రిపూట భక్తుల విశ్రాంతికి మహామండపం ఒకటో అంతస్థును సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వివాహాలు చేసుకునేవారికి టికెట్ ఇచ్చే విధానాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు. ఏడాది లోపు వయస్సున్న పిల్లలున్న భక్తులకు శీఘ్రదర్శనం ఏర్పాటు చేయిస్తున్నట్టు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa