శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల వ్యవహారం కలకలంరేపింది. ఎచ్చెర్ల పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.55 లక్షల విలువైన రూ.2 వేల నకిలీ నోట్లు దొరికాయి. ఈనెల 24న ఎచ్చెర్ల మండలం చిలకపాలెం దగ్గర పోలీసులు తనిఖీలు చేశారు.. ఈ క్రమంలో కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన దుంగ వీరమణికంఠ దగ్గర రూ.37 లక్షల విలువైన రెండు వేల రూపాయల నకిలీ నోట్లు దొరికాయి. అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ముందస్తు సమాచారంతోనే ఈ తనిఖీలు నిర్వహించారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 29న పైడిభీమవరం దగ్గర మరోసారి తనిఖీలు చేస్తుండగా విజయనగరంకు చెందిన గనగళ్ల విజయ్కుమార్, కర్ణాటకకు చెందిన కె వెంకటరెడ్డి దగ్గర మరో రూ.17.98 లక్షల విలువైన నోట్లు దొరికాయి. వీటితో పాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండుచోట్ల దాడుల్లో రూ.55 లక్షల విలువైన నోట్లు స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. రూ.2 వేల నోట్ల మార్పిడి జరుగుతుండటంతో కొందరు ఇలా నకిలీ నోట్లు చలామణి కోసం ఇలా నకిలీ నోట్లను తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఫేక్ కరెన్సీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa