యువగళం పాదయాత్రలో భాగంగా భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్పై నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ప్రజాధనం అంటే ఎమ్మెల్యేకు మహా ఇష్టం ఆయనో భూ బకాసురుడు.. తక్కువ రేటుకు స్థలం కొని అదే భూమిని జగనన్న ఇళ్ల కోసం అధిక ధరలకు విక్రయించారు. దాదాపు రూ.52 కోట్ల భూ కుంభకోణంలో తన వంతు తీసుకున్నారు. ఆయన ఆవినీతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్కు ఫిర్యాదు చేస్తే వారిపై కేసులు పెట్టారు. సొంతపార్టీ నాయకులపై కేసులు పెట్టిన ఘనత ఈ ఎమ్మెల్యేది. 100 ఎకరాల అసైన్డ్ భూముల్లో చెరువులు తవ్వుకున్నారు. భీమవరంలో ఒక రహదారి కూడా నిర్మించలేని ఎమ్మెల్యే అవసరమా అంటూ నిలదీశారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే భీమవరాన్ని మోడల్ నగరంగా తీర్చిదిద్దుతా మన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉండి నియోజవర్గంలో అందరికి మంచినీరు ఇచ్చే బాధ్యత తీసుకుంటుందన్నారు. పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలను గుండెలో పెట్టుకుంటామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa