ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాణ్యం పార్టీ నేతలతో భేటీకానున్న చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 07, 2023, 05:24 PM

 తెలుగుదేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబునాయుడు ఈనెల 9న పాణ్యం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బాబు ష్యూరిటీ ..భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత శనివారం పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారని పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం మాధవీనగర్‌లోని తమ స్వగృహంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా మాజీ సీఎం చంద్రబాబునాయుడు చేపట్టిన బాబు ష్యూరిటీ ..భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కల్లూరు అర్బన్‌, కల్లూరు, ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల మండల టీడీపీ అధ్యక్షులు, నాయకులకు పిలుపునిచ్చారు. చెన్నమ్మ సర్కిల్లో 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభకు టీడీపీ నాయకులు కార్యకర్తలు వేల సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ అబ్జర్వర్‌, కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా, మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పెరుగు పురుషోత్తంరెడ్డి, కల్లూరు మాజీ సింగిల్‌విండో చైర్మన్‌ ఎన్‌వీ రామకృష్ణ, విశ్వేశ్వరరెడ్డి, జయరామిరెడ్డి, గోవిందరెడ్డి, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa