ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందరికి అందుబాటులోకి ఆరోగ్య సురక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 07, 2023, 05:27 PM

త్వరలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అందుబాటులోని తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పూనంమాల కొండయ్య తెలిపారు. బుధవారం వెలగపూడి సచివాలయం నుంచి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు సంయుక్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆరోగ్య సురక్ష కార్యక్రమం విధివిధానాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు. ఆమె మాట్లాడుతూ పౌరులలో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, వారి ఆరోగ్య అవసరాలను ప్రచార పద్ధతిలో పరిష్కరించడం ఈ కార్యక్రమ లక్ష్యం అన్నారు. పౌరుల ఆరోగ్య అవసరాలను గుర్తించడానికి డోర్‌ టు డోర్‌ ప్రచారం, సంప్రదిం పులు, చికిత్స, రిఫరల్‌ కోసం ఆరోగ్య శిబిరం ఏర్పాట్లు ఉంటాయన్నారు. ఏఎన్‌ ఎంలు ఇంటింటికి వెళ్లి అవసరమైన పరీక్షలు నిర్వహించడం, వారి పూర్తి కేస్‌ షీట్లతో పాటు ఫలితాలను వైద్యుల వద్ద అందుబాటులో ఉంచుతారన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 15న లాంఛనంగా ప్రారంభిస్తారని, 30వ తేదీ నుంచి ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. శిబిరానికి ఇద్దరు అదనపు వైద్యులు, స్పెషలిస్టు లను నియమి స్తామన్నారు. వీసీలో కలెక్టర్‌ పి.ప్రశాంతి, జేసీ ఎస్‌.రామ్‌సుందర్‌ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి.మహేశ్వరరావు, ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్‌ సూర్యనారాయణ, ఐసీడీఎస్‌ పీడీ సుజాతరాణి, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి కేసీహెచ్‌ అప్పారావు, డీఈవో ఆర్‌.వెంకటరమణ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa