ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతాంగంపై ప్రభుత్వానికి అవగాహనా లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 01:31 PM

వ్యవసాయాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయంపై సవతి తల్లి ప్రేమ కూడా చూపలేని అసమర్థ సీఎం జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయం అప్పుల ఊభిలో మునిగిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఖరీఫ్ సీజన్‌పై కనీసం సమీక్ష చేసిన పరిస్థితులు లేవన్నారు. వరికి సాగు నీరు ఇవ్వలేమని నీటి పారుదల శాఖ మంత్రి చెప్పారని మండిపడ్డారు. ప్రత్యామ్నాయ ఏం పంటలు వేయాలో ఇప్పటి వరకు ఆలోచన చేయలేదన్నారు. రైతు భరోసా కేంద్రాలు దళారీ కేంద్రాలలాగా పని చేస్తున్నాయన్నారు. ఏ రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa