ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చట్టం ముందు అందరూ సమానులే,,,,మంత్రి గుడివాడ అమర్నాథ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 09:23 PM

చట్టం ముందు అందరూ సమానులేనని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. దొంగ పనులు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయవద్దని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. అందుకే రాజధాని పేరుతో రూ.118 కోట్లు తీసుకున్న చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ అయ్యాయన్నారు. ఎలాంటి తప్పు చేయకుంటే పార్థసాని, శ్రీనివాస్‌లను దేశం ఎందుకు దాటించారో చెప్పాలన్నారు. చంద్రబాబుకు సహకరించిన దొంగలు ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తామన్నారు. తనను అరెస్ట్ చేస్తారని చెబుతూ చంద్రబాబు సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు జారీ అయిన ఐటీ నోటీసులపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa