ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తప్పు చేశాడు కాబట్టే ఐటీ నోటీసులకు భయపడుతున్నారు,,,అంబటి రాంబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 09:24 PM

తప్పు చేశాడు కాబట్టే ఐటీ నోటీసులకు చంద్రబాబు భయపడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తప్పుచేసిన వారిని ఎవరినైనా, ఎక్కడైనా అరెస్ట్ చేస్తారని ఆయన అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసులపై మంత్రి... శుక్రవారం మరోసారి స్పందించారు. ఆయన తప్పు చేశాడు కాబట్టే ఐటీ నోటీసులకు భయపడుతున్నారన్నారు. నోటీసులు ఇచ్చినందుకు గాను ఆయన అధికారులను ఎదురు ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అంశంలో రూ.118 కోట్ల మేర ముడుపులు తీసుకున్నారని నిర్ధారించుకున్న తర్వాతే ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చి ఉంటారన్నారు. తనను అరెస్ట్ చేస్తారని తనంతట తానుగానే టీడీపీ అధినేత చెప్పుకుంటున్నారన్నారు. తప్పు చేస్తే ఎవరినైనా, ఎక్కడైనా అరెస్ట్ చేస్తారన్నారు. సభలు, యాత్రల పేరుతో పోలీసులపై ఎవరైనా రాళ్ల దాడి చేస్తే ప్రభుత్వం మాత్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతులకు మంత్రి అంబటి ఓ సూచన చేశారు. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలన్నారు. ఏపీలో వర్షాభావం ఉన్నందున పరిస్థితిని అధిగమించే ప్రయత్నం చేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa