కేరళలో కలకలం సృష్టిస్తున్న నిఫా వైరస్ పై అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ.. వైరస్ నియంత్రణకు రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కేరళలలోని వివిధ జిల్లాలలో ఉన్న లేబరేటరీలకు ఈ నిధులు విడుదల చేసింది. వెంటనే వైరస్ ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. వైరస్ నిర్ధారణ పరీక్షలతో పాటు బాధితులకు అవసరమైన చికిత్స అందించాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ శుక్రవారం వివరాలు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa