భీమవరం పట్టణంలో పట్టపగలు నడిరోడ్డుపై ఒక రౌడీ షీటర్ దారుణంగా హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్ళితే... బలుసుమూడికి చెందిన రౌడీషీటర్ బెవర విజయ్ (25) హైద్రాబాద్లో చిన్న ఉద్యోగం చేసేవాడు. ప్రస్తుతం భీమవరంలోనే ఉంటున్నాడు. గత ఏడాది డిసెంబర్ 24న జరిగిన రౌడీ షీటర్ రౌతుల ఏసు హత్య కేసులో విజయ్ మూడో నిందితుడు. ఆ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. ఆదివారం ఉదయం భీమవరం రెండో పట్టణ పోలీస్స్టేషన్లో నిర్వహించిన రౌడీషీటర్ల కౌన్సెలింగ్కు విజయ్ అతని సోదరుడు హాజరయ్యారు. అనంతరం ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతుండగా గొల్లవానితిప్ప రోడ్లోని దుర్గాలక్ష్మీ దేవాలయం సమీపానికి వెళ్లేసరికి స్కార్పియో వాహనంపై ఆరుగురు వచ్చి బైక్ను ఢీకొట్టారు. బైక్ నడుపుతున్న విజయ్ కిందపడిపోవడంతో కత్తులతో తలపై నరికి హత్య చేశారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య చేసినవారిలో శ్యామ్కుమార్ కత్తితో పోలీసులకు పట్టుబడగా మిగిలిన ఐదుగురు కిరణ్, సుబ్బు, సాయి, గణేష్, సతీష్లు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa