ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్,,,45 నిమిషాల పాటూ భువనేశ్వరి, బ్రాహ్మణి, యనమల భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 18, 2023, 02:09 PM

రాజమహేంద్రవరం జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కుటుంబసభ్యులు మరోసారి కలిశారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ములాఖత్‌ ద్వారా కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు చంద్రబాబుతో వారు మాట్లాడారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. తప్పుడు కేసులో చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించారన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. చంద్రబాబు చాలా బాధతో ఉన్నారని.. పార్టీ కార్యకర్తలు ఎలా ఉన్నారని అడిగి తెలుసుకున్నారన్నారు. పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని తెలిసిందని.. ఆ వివరాలు ఆరా తీశారన్నారు. ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఆయన ప్రస్తావించారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించామన్నారు. డీఐజీతో చంద్రబాబుకు అందిస్తున్న భద్రతపైనా ఆరా తీశామన్నారు.. ఆయన రూమ్‌లో ఏసీ లేదన్నారు. ఆయనకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు యనమల.


అంతకుముందు రాజమహేంద్రవరంలోని శ్రీ సిద్ది లక్ష్మీ గణపతి ఆలయంలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరతో కలిసి రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని వినాయకుడి ఆలయానికి చేరుకున్న భువనేశ్వరి స్వామివారికి పూజలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం కోసం భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భువనేశ్వరి, బ్రాహ్మణి, యనమల జైలుకు వెళ్లి చంద్రబాబును కలిశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa