చంద్రబాబు చాలా భయస్తుడు అంటున్నారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. 49 ఏళ్లుగా చంద్రబాబు తనకు తెలుసని.. సొంత తమ్ముడుకి మేలు చేసినా జనాలు ఏమి అనుకుంటారో అని సహాయం చేయకుండా ఉండే వ్యక్తి అన్నారు. కానీ వ్యక్తిగత కక్ష రాజకీయాలు మంచిది కాదని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఎంతో కలిసి మెలసి ఉండేవారన్నారు. అనుభవం లేకపోవడం వల్ల వైఎస్ జగన్ ఇలాంటి చర్యలు తీసుకున్నారని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకే అనుకూలంగా మారిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్పై ఎమ్మెల్యేలకు నమ్మకం లేదన్నారు మోహన్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు జైల్లో.. వైఎస్ జగన్ బెయిల్ పై ఉన్నారన్నారు. మహిళా రిజర్వేషన్ పై బీజేపీ చేస్తున్నది మ్యాజిక్.. నమ్మడానికి ఏమీ లేదన్నారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని.. మహిళ రిజర్వేషన్ టీటీడీలో.. సుప్రీంకోర్టు జడ్జి నియామకాల్లో.. ఐఏఎస్లలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారాయన. రూ.17 వేల కోట్ల టీటీడీ నిధులు, బంగారం నిల్వలు ఎక్కడ పోయాయో టీడీపీ అధికారులు చెప్పాలన్నారు. రూ.17 వేల కోట్లను వడ్డీ కోసం ఇచ్చామంటున్నారని.. అది ఎక్కడ ఇచ్చారంటే మాత్రం టీటీడీ నుంచి సమాధానం లేదన్నారు.
చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదన్నారు చింతా మోహన్. చంద్రబాబు చాలా కష్టపడి అంచలంచెలుగా ఎదిగిన నాయకుడని.. అక్రమంగా ఆయనను అరెస్టు చేయడం తగదన్నారు. చంద్రబాబు తప్పు చేశాడంటే ఎవరు నమ్మరన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ అసలు స్కామ్ కాదన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక కొందరు పెద్దల హస్తం ఉందని గతంలోనే మోహన్ ఆరోపించారు.. వారికి సంబంధం లేకుండా ఈ అరెస్టు జరగదన్నారు. చంద్రబాబు తప్పు చేసి ఉండరని.. ఇలా అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రిగా ఎవరూ పనిచేయరన్నారు. సుప్రీం కోర్టులో చంద్రబాబుకు న్యాయం జరగడం ఖాయమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa