ప్రపంచ హృదయ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 29న విజయనగరంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో ఉచిత గుండె పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆసుపత్రి ఎండీ డాక్టర్ తిరుమల ప్రసాద్ చెప్పారు. మంగళవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఆ రోజు ఉదయం ఈ వివిధ కళాశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆసుపత్రిలో గుండె జబ్బులకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహిస్తామని, అనంతరం బీపీ, ఈసీజీ, లిపిడ్ ఫ్రొఫైల్, 2డి ఈకో స్ర్కీనింగ్ తదితర పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు. అవసరమైన వారు తమ వివరాలను 91549 99976 నెంబరుకు ఫోన్ చేసి రిజిస్టర్ చేయించు కోవాలని సూచించారు. తిరుమల మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం వర్కింగ్ జర్నలిస్టులకు ఉచితంగా ప్రివిలేజ్ హెల్త్ కార్డులను అందజేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa