ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్య సురక్ష విధివిధానాలేమిటో ప్రకటించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 01, 2023, 03:11 PM

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేరుతో ప్రజల నుంచి సేకరించే డేటాకు భద్రత ఏమిటో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ప్రజల వ్యక్తిగత ఆరోగ్య వివరాలు ల్యాబ్‌ టెస్టుల ద్వారా ఫార్మా కంపెనీలకు కట్టబెడితే చాలా ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.వేల కోట్ల విలువ చేసే డేటాను ఫార్మా కంపెనీలు అక్రమంగా వాడుకుని రూ.లక్షల కోట్లు ఆర్జించేందుకు సన్నద్ధమవుతున్నాయని తెలిపారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం విధివిధానాలేమిటో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa