ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్రిసెట్‌-2023 ఫలితాలు విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 02:26 PM

గుంటూరు(లాం)లోని వర్సిటీ కార్యాలయంలో ఉప కులపతి శారదా జయలక్ష్మీదేవి అగ్రిసెట్‌-2023 ఫలితాలను విడుదల చేశారు. 1,201 మంది బాలికలు, 905 బాలురుతో కలిపి, 2,006 మంది అభ్యర్ధులు హాజరవ్వగా, 1,994 (99.5ు) ఉత్తీర్ణత సాధించారు. 1,884 మంది వ్యవసాయ డిప్లొమా, 42 మంది సేంద్రియ వ్యవసాయ, 80 మంది విత్తన సాంకేతిక విభాగాల్లో ఉత్తీర్ణులయ్యారని వీసీ తెలిపారు. విద్యార్థుల మార్కుల కార్డులను వర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, కౌన్సెలింగ్‌ ఇతర వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. వ్యవసాయ డిప్లొమాలో 119/120 మార్కులతో ఆర్‌.హేమంతకుమార్‌ (తిరుపతి), సేంద్రియ వ్యవసాయంలో 107/120మార్కులతో వై.యశస్విని (అనంతపురం), విత్తన సాంకేతికతలో 106/120 మార్కులతో తెలంగాణాకు చెందిన ఉపాసి బాలాజీ, లౌడ్యా రాజేష్‌ ప్రథమ స్థానాలు సాధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa