ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రోజు రోజుకు వేడెక్కిపోతోంది. మంత్రి రోజా మీద మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇటు రాష్ట్రవ్యాప్తంగానే కాదు.. దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికి పలువురు రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు కూడా బండారు వ్యాఖ్యలను ఖండిస్తూ.. రోజాకు మద్దతు తెలిపారు. ఖుష్బూ, రాధిక లాంటి సీనియర్ నటీమణులు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. ఇప్పుడు అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మాజీ మంత్రి బండారుపై నవనీత్ కౌర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసి.. ఇప్పుడు రాజకీయ రంగంలో ఓ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి... అందులోనూ ఓ మహిళను పట్టుకుని ఇంత నీచంగా మాట్లాడేందుకు సిగ్గుందా అంటూ బండారుపై నవనీత్ కౌర్ విరుచుకుపడ్డారు.
మంత్రి రోజాపై ఇంత దిగజారి మాట్లాడతారా అంటూ బండారుపై నవనీత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఎంత ధైర్యం అని ప్రశ్నించారు. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా.. అని నిలదీశారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు చాలా గౌరవం ఇస్తారని చెప్పుకొచ్చారు. తాను కూడా పార్లమెంట్కు వెళ్లినప్పుడు అందరితో సరదాగా మాట్లాడతానని.. అందరి దగ్గర కూర్చుంటాని తెలిపారు. అయితే.. సభకు వెళ్లి సమయంలోనూ.. తాను తెలుగు సినిమాలు చేసినందుకు, తెలుగు మాట్లాడుతున్నందుకు అందరూ తనను ఎంతగానో గౌరవిస్తారని చెప్పుకొచ్చారు.
అలాంటిది.. ఓ తెలుగువాడై ఉండి.. అందులోనూ ఓ నాయకుడిగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు నవనీత్ కౌర్. ఈ బండారు సత్యనారాయణ మూర్తి.. ఆంధ్ర, తెలంగాణ మహిళల గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడాడని మండిపడ్డారు. బండారుకు రాజకీయలు ముఖ్యమా..? లేక ఆంధ్ర, తెలంగాణ మహిళల గౌరవం ముఖ్యమా.. అంటూ ప్రశ్నించారు. బండారుకి ఇప్పటికైనా సిగ్గురావాలన్నారు. మంత్రి రోజాకు తామంతా అండగా ఉంటాన్నారు. తానే కాదు.. యావత్ మహిళలంతా రోజాకు అండగా ఉంటారని చెప్పుకొచ్చారు. తాను ఒక ఎంపీగా, నటిగా, మహిళగా రోజాకి అండగా ఉంటానని నవనీత్ కౌర్ మద్దతు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa