జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం దేశానికే ఆదర్శమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు ఇతర వైద్య శిబిరాల కంటే ఎంతో ప్రత్యేకమైనవని, ఈ శిబిరాల్లో నిర్వహించిన వ్యాధి నిర్ధారణ పరీక్షల సమాచారంతో ప్రతి వ్యక్తికీ ఒక హెల్త్ ప్రొఫైల్ రూపొందించడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రొఫైల్ ఆయా వ్యక్తులకు భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు నిర్వహించే వైద్య చికిత్సల సందర్భంగా ఇది ఎంతో కీలకంగా వుంటుందన్నారు. శిబిరాల్లో అందజేసే హెల్త్ ప్రొఫైల్ను ప్రతిఒక్కరూ భద్రపరచి జాగ్రత్తగా వుంచుకోవాలని సూచించారు. ప్రజల అవసరాలు తెలుసుకొని వాటిని నెరవేర్చడమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రజలంతా ఈ శిబిరాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa