ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈతకి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 15, 2023, 03:29 PM

కృష్ణా జిల్లా, అవనిగడ్డ, సింహాద్రి కాలనీకి  విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్ళితే... కాలనీకి  చెందిన ఆవుల సిద్ధార్థ, బాలయ్య, తమటం సంతోష్‌, వల్లమల నాగ చైతన్య దసరా సెలవులు కావటంతో శనివారం ఉదయం 10 గంటల సమయంలో తమ ఇంటి వద్ద ఉన్న పంట కాలువలో ఈత నేర్చుకునేందుకు వెళ్లారు. ప్రవాహ వేగానికి ఆవుల సిద్దార్థ (12), వల్లమల బాలయ్య కొట్టుకుపోగా, తమటం సంతోష్‌, వల్లమల నాగ చైతన్య త్రుటిలో తప్పించుకుని ఒడ్డుకు చేరుకున్నారు. సిద్ధార్థ, బాలయ్య గల్లంతు కావటంతో సంతోష్‌, నాగ చైతన్య సమీపంలోని వారికి సమాచారం ఇచ్చారు. స్థానిక యువత వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. కాగా, సిద్ధార్థ శనివారం మధ్యాహ్నం లాకులు దాటిన తర్వాత కనిపించగా, హుటా హుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. బాలయ్య ఆచూకీ కోసం అవనిగడ్డ సీఐ రమేష్‌, ఎస్‌ఐ రమేష్‌, ఫైర్‌, రెవెన్యూ సిబ్బంది వెతుకుతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa