శ్రీకాకుళం నగరంలోని అఫీషియల్ కాలనీకి చెందిన భార్యభర్తలు హనుమంతు జ్యోతి, కిరణ్ కుమార్ భువనేశ్వర్లోని నయాపల్లి ఏరియాలో అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం 3,500 సిమెంట్ బస్తాల అవసరమని ఓ సిమెంట్ కంపెనీ టోల్ఫ్రీ నెంబరుకు జ్యోతి ఫోన్ చేశారు. జ్యోతితో ఆ కంపెనీ మేనేజర్ అమిత్సింగ్ మాట్లాడి.. మరో వ్యక్తి నెంబరు ఇచ్చి మాట్లాడమని చెప్పాడు. దీంతో అతనిని సంప్రదించగా సెప్టెంబరు 12న కంపెనీ లెటర్ హెడ్పై ఎస్టిమేషన్ వేసి నగదు ఖాతాలో జమ చేయాలని సెంట్రల్ బ్యాంకు ఖాతా నెంబరు ఇచ్చాడు. దీంతో 13న పలు విడతలగా రూ.13.10 లక్షలు సంబంధిత బ్యాంకు ఖాతాలో జమ చేశారు. నగదు అందిందని చెప్పి న ఆ వ్యక్తి సిమెంట్ బస్తాలు పంపించకపోవడంతో విసిగి పోయి నగదు వెనక్కి ఇచ్చేలాని కోరారు. దీంతో ఆ వ్యక్తి తప్పించుకుని తిరుగుతున్నాడు. దీనిపై ఒకటో పట్టణ పోలీసులకు శనివారం జ్యోతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇన్ టౌన్ ఎస్ఐ బలివాడ గణేష్ కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa