ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేనను నాదెండ్ల మనోహర్ రేప్ చేస్తున్నాడు: కేతం రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 16, 2023, 11:02 PM

ఇటీవల జనసేన పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారంటూ నాదెండ్ల మనోహర్‌పై మండిపడ్డారు కేతం రెడ్డి. జనసేనను నాదెండ్ల మనోహర్ రేప్ చేస్తున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాదెండ్ల మనోహర్ టీడీపీ కోవర్టు అని.. అతడి వల్ల జనసేన కార్యకర్తలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. అయితే.. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినానని తెలిపిన కేతం రెడ్డి... ఈసారి తన టికెట్ నారాయణకు ఇచ్చినట్టు అధిష్ఠానం చెప్పిందని పేర్కొన్నారు. అధిష్ఠానం ఆదేశం మేరకు రేసు నుంచి తప్పుకున్నా.. నెల్లూరు ఎన్నికల సమన్వయ కర్తగా అయిన పదవి అడిగినా ఇవ్వలేదని తెలిపారు.


తాను పార్టీ కోసం ఎంత కష్టపడినా సముచిత స్థానం కల్పించలేదని కేతం రెడ్డి ఆరోపించారు. తనలాంటి కష్టపడే కార్యకర్తలకు కాకుండా.. డబ్బాగాళ్లకు, డబ్బులున్నోళ్లకు మాత్రమే పదవులు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పదవులు నాదెండ్ల మనోహర్‌కే కావాలని.. తనకు నచ్చిన వారికే ఇచ్చుకుంటాడని కీలక ఆరోపణలు చేశారు. ఏ పదవి లేకుండా నాదెండ్ల మనోహర్‌ ఉండలేడని విమర్శించారు. పదేళ్ల నుంచి ఇంకా జనసేన పార్టీ నిర్మాణంలోనే ఉందని.. చెప్తున్నారన్నారు. నెల్లూరు సీటిలోని 28లో డివిజన్లలో 28 మంది నాయకులకు, కేడర్‌ను తయారు చేసుకున్నానని.. అలాంటిది పార్టీని పదేళ్లలో నిర్మాణం చేసుకోలేకపోవటమేంటని నిలదీశారు. అయితే.. వైసీపీలో చేరినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని.. డబ్బు కోసం తాను పార్టీలోకి రాలేదని కేతం రెడ్డి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa