కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం రాష్ట్రంలో కన్నడ భాషకు ప్రాచుర్యం కల్పించాలని కోరారు. కన్నడ మాట్లాడని నివాసితులు భాషను నేర్చుకునేలా సహాయం చేయాలని ఆయన స్థానికులను కోరారు. మైసూరు రాష్ట్రానికి కర్ణాటకగా నామకరణం చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కన్నడ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కన్నడ అనివార్యమైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కర్నాటక ఏకీకరణ తర్వాత వివిధ భాషలు మాట్లాడే ప్రజలు కన్నడ దేశంలో స్థిరపడ్డారని, కర్ణాటకలో నివసించే ప్రతి ఒక్కరూ కన్నడ మాట్లాడటం నేర్చుకోవాలని ఆయన అన్నారు. ఇతర భాషలను ప్రేమించాలి కానీ మన భాషను మాత్రం మరచిపోకూడదని అన్నారు.అనేక సంవత్సరాలుగా కన్నడ అధికార భాషగా ఉన్నప్పటికీ, పరిపాలనలో కన్నడను అమలు చేయకపోవడానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ముఖ్యమంత్రి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa