ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య సాగుతున్న యుద్ధం,,,,మినీ ఇజ్రాయెల్ ఆఫ్ ఇండియా వాసుల్లో ఆందోళన

national |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 08:58 PM

ప్రస్తుతం ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య భీకర యుద్ధం సాగుతోంది. రెండు వైపుల నుంచి సైన్యాలు వైమానిక దాడులతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాల్లో నివసిస్తున్న ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజలు.. తమ వారు ఎలా ఉన్నారోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే భారత్‌లోనూ వివిధ ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్ వాసులు నివసిస్తున్నారు. ఇక ఒక ప్రాంతంలోనైతే చాలా మంది ఇజ్రాయెల్ పౌరులు ఉంటారు. అందుకే ఆ ప్రాంతాన్ని మినీ ఇజ్రాయెల్ అని కూడా పిలుస్తారు. దీంతో ఆ ప్రాంతం ఎక్కడ ఉందా అని అందరికీ సందేహం కలుగుతోంది.


ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంపైనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే మినీ ఇజ్రాయెల్ అనే ప్రాంతం ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఈ మినీ ఇజ్రాయెల్ మన భారతదేశంలోనే ఉండటం గమనార్హం. అది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ హిమాచల్ ప్రదేశ్‌కు ఏటా ఇజ్రాయెల్ యువత భారీగా తరలివస్తుంది. హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్ర శీతాకాల రాజధాని అయిన ధర్మశాలకు సమీపంలో ధరమ్‌కోట్ ప్రాంతానికి ఇజ్రాయెల్ వాసులతో చాలా దగ్గరి సంబంధం ఉంది. అక్కడ ఉండే ప్రాంతాన్ని పర్వతాల టెల్ అవీవ్ అని కూడా పిలుస్తుంటారు. టెల్ అవీవ్ అనేది ఇజ్రాయెల్ రాజధాని పేరు.


మొదట 1990 లో ఇజ్రాయెల్ వాసులు ఇక్కడికి వచ్చారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్‌కు చెందిన చాలా మంది యువత ప్రతి సంవత్సరం హిమాచల్‌ప్రదేశ్‌కు భారీగా తరలివస్తూ ఉంటారు. ఇజ్రాయెల్‌లో ప్రతి ఒక్కరికీ సైనిక శిక్షణ తీసుకుంటారు. ఆ తర్వాత శిక్షణ పూర్తయిన తర్వాత ఏటా అధిక సంఖ్యలో యువకులు హిమాచల్ ప్రదేశ్‌కు వస్తూ ఉంటారు. అయితే కొందరు యువకులు చాలా కాలం ఇక్కడే గడుపుతారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు పరిధిలోని కసోల్ అనే చిన్న గ్రామం ఉంటుంది. దాన్ని మినీ ఇజ్రాయెల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలోనూ ఇజ్రాయెల్ ప్రజలు చాలా రోజులు నివసిస్తూ ఉంటారు. స్థానికంగా ఉన్న అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం కులు జిల్లాలో సుమారు 1500 మంది ఇజ్రాయెల్ ప్రజలు జీవిస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధరమ్‌కోట్‌తో పాటూ ఢిల్లీలోని పహర్‌గంజ్, రాజస్థాన్‌లోని అజ్మీర్ ప్రాంతాలను కూడా ఇజ్రాయెల్ పౌరులు సందర్శిస్తూ ఉంటారు. ఈ ప్రాంతాల్లో ఉండే యూదుల మతపరమైన ఖబద్ హౌస్ అనే స్థలంలో ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు. యూదుల నూతన సంవత్సరాన్ని కూడా భారత్‌లోనే జరుపుకుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa