నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ జరిగింది. ఈమ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 288 పరుగులు చేసింది. అయితే 289 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన అఫ్గానిస్థాన్ 34.4 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవిచూసింది. అఫ్గానిస్థాన్ బ్యాట్స్ మెన్స్ రహ్మత్ షా 36 పరుగులు,అజ్మతుల్లా ఒమర్జాయ్ 27, ఇక్రమ్ అలీఖిల్ 19 పరుగులు చేశారు. రహ్మనుల్లా గుర్బాజ్ 11 పరుగులు చేసాడు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. శాంట్నర్ కు 3, బౌల్ట్ కు 2, మాట్ హెన్రీ 1, రచిన్ రవీంద్ర 1 వికెట్ తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa