ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 28, 2023, 02:14 PM

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంఘాల ఐక్యంగా నవంబరు 8వ విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. శుక్రవారం అనంతపురం జిల్లా, కంబదూరు పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....  విశాఖ ఉక్కు కర్మాగారం లాభాలలో నడుస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. విభజన హామీలను తక్షణమే నెరవేర్చి కడపలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయస్వామి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్‌, జిల్లా అధ్యక్షులు ఆనంద్‌ కుమార్‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సురేష్‌ యాదవ్‌, జిల్లా కోశాధికారి హనుమంతరాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు శివ, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa