మన ప్రియతమ నేత చంద్రబాబు గారికి మధ్యంతర బెయిల్ వచ్చిందన్న విషయం తెలిసి మనసంతా ఆనందంతో నిండిపోయిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఆయన త్వరలోనే ప్రజలతో మమేకం అవుతారని భావిస్తున్నట్టు తెలిపారు. అంతిమంగా గెలిచేది న్యాయమేనని తాను గట్టిగా నమ్ముతానని, త్వరలోనే చంద్రబాబుకు పూర్తి స్థాయిలో ఊరట లభిస్తుందన్న నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు. చంద్రబాబు పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, చికిత్స పొంది, త్వరగా సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవాలని కోరుకుంటున్నట్టు గల్లా జయదేవ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa