ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడు,,,,ప్రైవేట్ ఫోటోలు ఫ్రెండ్‌కి పంపడంతో మరో దారుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 05, 2023, 05:50 PM

విజయవాడలో బీటెక్ చదువుతున్న ఓ అమ్మాయి.. ఇద్దరు వంచకుల చేతిలో దారుణంగా మోసపోయింది. యువతి పొరుగు గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెతో మాటలు కలిపి, ప్రేమిస్తున్నానంటూ వెంటపడి, నమ్మించి మోసం చేశాడు. బెంగళూరులోని లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలను చిత్రీకరించి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ ఫోటోలను అతడి స్నేహితుడికి పంపించగా.. వాటిని అడ్డంగా పెట్టుకొని అతడు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరికి సోషల్ మీడియాలో బాధితురాలి బంధువు ఒకరు ఆమె ఫోటోలను చూసి.. ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన యువతి విజయవాడలో హాస్టల్‌లో ఉంటూ బీటెక్‌ చదువుతోంది. ఆమెతో అదే మండలానికి చెందిన కృష్ణారెడ్డి అనే యువకుడు 5 నెలల కిందట పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమెను నమ్మించేందుకు బ్లేడుతో తన చేయి కూడా కోసుకున్నాడు. దీంతో భయపడిన యువతి అతడితో చనువుగా ఉండేది. అక్టోబరు 19న కృష్ణారెడ్డి యువతికి ఫోన్‌ చేసి బెంగళూరు రావాలని కోరాడు. రాకపోతే ఇద్దరి మధ్య ఉన్న పరిచయం గురించి కుటుంబసభ్యులకు, తెలిసిన వారికి చెబుతానంటూ బెదిరించాడు. దీంతో భయపడిన యువతి 20న బెంగళూరు వెళ్లింది. అతడు ఆమెను తన మిత్రుడి గదికి తీసుకెళ్లి, బెదిరించి అత్యాచారం చేశాడు. ఏకాంతంగా ఉన్న ఫోటోలను మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి ఆమెను మరింతగా బెదిరింపులకు గురిచేశాడు. 4 రోజుల తర్వాత ఆ అమ్మాయి అతడి బారి నుంచి తప్పించుకుని సొంతూరుకు వెళ్లిపోయింది.


తనపై జరిగిన దారుణాన్ని తలచుకొని కుమిలిపోతూ.. తల్లిదండ్రులకు తెలిస్తే పరువు పోతుందని భయపడుతూ దు:ఖాన్ని దిగమింగుకుంది. అక్టోబరు 28న తిరిగి కాలేజీకి వెళ్లేందుకు బయల్దేరింది. గుత్తి వరకు రాగానే.. గుంతకల్లుకు చెందిన దివాకర్‌ అనే యువకుడి నుంచి ఫోన్‌ వచ్చింది. బెంగళూరులో కృష్ణారెడ్డితో ఏకాంతంగా గడిపిన ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని.. తాను చెప్పినట్టు చేయకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. భయంతో వణికిపోయిన బాధితురాలు అతడు చెప్పినట్లే గుంతకల్లు వెళ్లింది. అనంతరం ఆమెను ఓ లాడ్జికి తీసుకెళ్లి, బెదిరింపులకు పాల్పడుతూ 2 రోజుల పాటు అఘాయిత్యం చేశాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్యంగా ఫొటోలు చిత్రీకరించాడు. వాటిని మొదటి నిందితుడు కృష్ణారెడ్డి, మరికొందరికి పంపాడు. అంతేకాదు.. కృష్ణారెడ్డి, దివాకర్ వాళ్లకు తెలిసిన మిత్రులందరికీ ఆ ఫోటోలను పంపించారు.


ఇవేమీ తెలియని ఆ యువతి దివాకర్ బారి నుంచి బయటపడి నేరుగా విజయవాడలోని హాస్టల్‌కు వచ్చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఫొటోలు, వీడియోలు అదే మండలానికి చెందిన ఓ వ్యక్తికి చేరాయి. దీంతో అతడు యువతి సమీప బంధువులకు తెలిపాడు. కంగారుపడిన కుటుంబసభ్యులు తమ అమ్మాయి వద్దకు వచ్చి వివరాలు ఆరా తీశారు. తనపై జరిగిన దారుణం గురించి చెప్పుకొని ఆమె కన్నీరుమున్నీరైంది. కుటుంబసభ్యులు ఆమెను వెంటబెట్టుకొని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోపే నిందితులను పట్టుకొని విచారిస్తున్నామని దిశ డీఎస్పీ ఆంథోనప్ప తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa