ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ నేతలను గృహనిర్బంధం చేసిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 08, 2023, 03:22 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలం కేశవరంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు పరిశీలనకు వెళ్లాలని టీడీపీ, జనసేన నిర్ణయించింది. దీనిపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారిని వెళ్లనీయకుండా తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన ముఖ్య నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. మండపేటలో టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, వల్లూరులో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి వేగుళ్ళ లీలా కృష్ణ , రామవరంలో టీడీపీ రాష్ట్ర ఉపాద్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ, జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైన గ్రావెల్ అక్రమ తవ్వకాల పరిశీలనకు వెళ్లి తీరుతామని నేతలు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa