ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు అనకాపల్లిలో వైసీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 09, 2023, 01:05 PM

వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర ఈరోజు(గురువారం) అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్‌ ఆధ్వర్యంలో కొనసాగనుంది. ఉదయం గం. 10:30 ని.లకు మారేడుపూడిలో యాత్ర ప్రారంభం కానుంది. మారేడుపూడి నుంచి తేగడ గ్రామం వరకూ భారీ ర్యాలీగా బస్సుయాత్ర జరుగనుంది.  11 గంటకు తేగడ గ్రామంలో జగనన్న హౌసింగ్‌ కాలనీని పరిశీలించనున్నారు. 12 గంటలకు తేగడలో ఏపీ మోడల్‌  స్కూల్‌ పరిశీలన, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం తేగడ గ్రామం నుండి ఎన్టీఆర్‌ స్టేడియం వరకూ భారీ బైక్‌ ర్యాలీ ఉండనుంది. మూడ గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa