ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ హయాంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయా ? లేదా ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 09, 2023, 01:39 PM

పౌరుల జీవన ప్రమాణాల పెంపే ధ్యేయం అని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీ‌కాకుళంజిల్లా, శ్రీకూర్మంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 25 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయం టైప్ - 2 భవనం ప్రారంభించారు. నాడు - నేడు ప్రణాళికలో భాగంగా పొందర వీధి లో,మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 16 లక్షల రూపాయలతో నిర్మించిన భవనం ప్రారంభించి, నిర్వాహకులకు శుభాకాంక్ష లు అందించారు. అలానే ఇక్కడి ప్ర‌భుత్వ ఉన్నత పాఠశాలకు సంబంధించి 51 ల‌క్ష‌ల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించి సంబంధిత వర్గాలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గడప గడపకూ మన ప్రభుత్వం అన్న కార్యక్రమాన్ని 17 నెలలుగా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు గార మండలంలో ముగింపు..కార్యక్రమం జరుగుతోంది. ఇవాళ పాలనలో గొప్ప గొప్ప మార్పులు చేశాము..ఆ మార్పు లతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయా ? లేదా ? ఇంకా వారికి ఏయే అవసరాలు ఉన్నాయి అన్నవి తెలుసుకునేందు కు ప్రాధాన్యం ఇస్తున్నాం.ఇవాళ ప్రభుత్వం,ప్రభుత్వంలో విధులు నిర్వర్తించే అధికారులు, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కలిసి పని చేస్తూ,ఈ గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా మీతో మమేకం అవుతున్నాం. చాలా చిత్తశుద్ధితో 17 నెలలు ఈ కార్యక్రమం చేపట్టాం. అందరు అధికారులూ చాలా సమర్థవతంగా పని చేశారు. అనుబంధ అధికారులు కూడా బాగా పనిచేశారు. వీరితోపాటే సచివాల యం సిబ్బంది,వలంటీర్లు కూడా చక్కగా పనిచేసి సత్ఫలితాలు తీసుకు వచ్చేందుకు కృషి చేశారు. గడప గడపకూ..నిర్వహణలో భాగంగా గడిచిన 17 నెలలలో మనం ఇంటింటికీ వెళ్ళినప్పుడు సమాజంలో వచ్చిన మార్పును చూశాం. అది నాలుగున్నరేళ్లలో వచ్చిన మార్పు. 75 ఏళ్ల స్వాతంత్ర లో ఏ రాజకీయం పార్టీ అధికారంలోకి వచ్చినా..ఆ పార్టీ గుప్పెట్లోనే అధికారం ఉండేది. సంబంధిత వ్యవహారం నడిచేది. బలహీనులు ఎప్పుడూ వెనుక వెనుకనే ఉండే వాళ్ళు. తాము ఎన్నుకున్న  పాలనలో బితుకుబితుకుమంటూ బతికేవారిలో ఇవాళ ఓ ధైర్యం వచ్చింది. వైయ‌స్ఆర్‌సీపీ  పాలనలో మార్పు వచ్చింది. దేశంలో అందరూ హాయిగా జీవించాలి అన్నది రాజ్యాంగం నిర్దేశిస్తోంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం మీకు క్రమం తప్పక అందిస్తోంది. జీవన ప్రమాణాలు పెంపొందిస్తోంది. ఇప్పటికీ ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చాం.  నాలుగున్నరేళ్లలో గ్రామాల్లో ఉండే స్కూల్స్, గ్రామ సచివాలయం బిల్డింగ్స్, వెల్నెస్ సెంటర్స్,రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇవన్నీ అభివృద్ధి కాదా .. అని నేను విపక్షాలను అడుగుతున్నాను. ఇవన్నీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఉపయోగం కాదా.. ? అని నేను వారిని అడుగుతున్నాను. గత ప్రభుత్వాల హయాంలో పనిచేసిన వారెవ్వరూ ఇవి చేయలేదు కనుకనే..వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం వీటిని చేస్తోంది. మరో 20 ఏళ్ళు జగన్ ముఖ్య మంత్రిగా ఉంటే అన్ని వ్యవస్థలు బాగుపడతాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa