చంద్రబాబు హయాంలో ఆయన చేసింది పరిపాలనే కాదు. తనకు తన మనుషులకు లాభం చేకూర్చే స్కీమ్ల పట్ల ఫోకస్ పెట్టి పనిచేయడం తప్ప ప్రజలకు మేలు జరిగిందేమీ లేదు అని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ... 2014 నుంచి 2019 వరకు అనేక మాయమాటలతో ప్రజల్ని ముంచాడు. ఎన్నికలకు ముందు ప్రకటించిన మ్యానిఫెస్టోను చెత్తబుట్ట దాఖలా చేశాడు. ఇప్పుడు మళ్లీ జనసేన నుంచి పవన్కళ్యాణ్ తో పొత్తు అంటున్నాడు. మరి, ఆనాడు పొత్తు పెట్టుకుని ప్రకటించిన మ్యానిఫెస్టోను అమలు చేయనప్పుడు ప్రశ్నిస్తానన్న పెద్దమనిషి పవన్కళ్యాణ్ నోరుమెదపకపోవడం అందరూ చూశారు. 2014లో ఇదే చంద్రబాబు- పవన్ కల్యాణ్ లు కలిసి ఉన్న ఫోటోలతో, మ్యానిఫెస్టోలో అక్కచెల్లెమ్మలకు 12 సిలిండర్లు ఇస్తామన్నాడు. మరి, ఇచ్చారా..? అంటే ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్లు ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోలో మూడో నాలుగో సిలిండర్లు ఇస్తామని చెబుతున్నాడు. మళ్లీ ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉమ్మడి మ్యానిఫెస్టోతో వస్తున్నామంటున్నారు కనుక.. మరోసారి మోసకారి విధానాలతో వస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa