తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రె్సకు మద్దతు ఇవ్వాలని కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు లేఖ రాసినట్లు ఒక ఫేక్ లేఖ సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు. అది ఫేక్... దాన్ని ఎవరూ నమ్మవద్దు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. బుధవారం ఆయన ఓ ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. మా పార్టీ అధినేత చంద్రబాబు ఎవరికి ఓటేయాలనే విషయంలో పార్టీ కార్యకర్తలకు గాని, అభిమానులకు గాని ఎలాంటి సూచనలు చేయలేదు. చంద్రబాబు ఇమేజ్ను దెబ్బతీయడానికి వైసీపీ చేసిన కుట్రలో భాగమే ఈ దొంగ లేఖ. వైసీపీ బతుకే ఫేక్ బతుకు. ఫేక్ ప్రచారాలు, ఫేక్ లేఖలనే ఆ పార్టీ నమ్ముకుంది. ఆ ఫేక్ లేఖలో చంద్రబాబు సంతకాన్ని ఫోర్జరీ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. పోలీసు శాఖకు చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష పార్టీలు, నేతలపై అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి’’ అని అచ్చెన్న కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa