ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ ఎయిర్‌పోర్ట్ రాత్రి వేళల్లో మూసివేత,,,,నాలుగు నుంచి 6 నెలల పాటూ ఇదే పరిస్థితి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 10, 2023, 05:40 PM

విశాఖ ఎయిర్‌పోర్ట్‌‌‌లో రన్‌వేను రాత్రి సమయంలో మూసివేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి రాత్రిపూట మూసివేస్తున్నట్లు ఈఎన్‌సీ చీఫ్‌ రాజేష్ పెంధార్కర్‌ తెలిపారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. రన్‌వే పునరుద్ధరణ పనుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నెల 15 నుంచి దాదాపు 4 నుంచి 6 నెలల పాటు రాత్రిపూట విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని.. ఉదయం వేళలోనే తమ ప్రయాణాలకు ప్లాన్ వేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే విశాఖ విమానాశ్రయాన్ని రాత్రిపూట మూసివేయడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు నేవీ అధికారులతో చర్చలు జరిపారు. రాత్రి సమయంలో ఎయిర్‌పోర్ట్ మూసివేయవద్దంటూ అధికారులు కోరారు.. కుదిరితే సమయాన్ని అయినా తగ్గించాలని కోరారు. అయితే రన్‌వే పనుల కోసం రాత్రిపూట విమానాశ్రయాన్ని మూసివేయక తప్పదని ఈఎన్‌సీ చీఫ్ తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈఎన్‌సీ చీఫ్‌ ఎంపీకి వివరించారు. అయితే పగటిపూట సర్వీసులను పెంచుకునేందుకు మాత్రం ఈఎన్‌సీ చీఫ్‌ ఓకే చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa