సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా ఎమ్మల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ... జగనన్న సారథ్యంలో రాష్ట్రంలో సామాజిక సాధికారత, పేదవాడికి జరిగిన మేలు, ఆత్మగౌరవంతో ఎలా జీవించగలుగుతున్నారో అందరూ గమనించాలి. కృష్ణా జిల్లాలో రాజకీయ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఎక్కడా బీసీలు, ఎస్సీలు డయాస్పై కూర్చొనేవారు కాదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు పెద్దపీట వేసి వీళ్లూ నా సహచరులు, నా రాజకీయ వారసులు అని రాష్ట్రం నలుమూలలకు పంపుతున్న జగనన్న. గతంలో ప్రభుత్వ పథకం అందాలంటే నాయకుల వద్దకు వెళ్లి అడుక్కొనే పరిస్థితి. ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ పథకాలను తీసుకొచ్చి మీరు ఓటు వేయకున్నా పథకాలు అందిస్తున్న జగనన్న ప్రభుత్వం. రాజశేఖరరెడ్డి గారు సీఎం అయిన తర్వాతే రాష్ట్రంలో పేదవాళ్లు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంటికో ఇంజనీరు, ఐఏఎస్ అయ్యే పరిస్థితి జగనన్న, రాజశేఖరరెడ్డి తెచ్చారు. కొన్ని వేల ఎకరాలు కొని 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగనన్న. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడూ ఇలా చేయలేదు. చంద్రబాబు హయాంలో ఎప్పుడూ ఇవ్వలేదు. దేశంలో సామాజిక విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్రెడ్డిగారు. పేదవాళ్ల కోసం జగనన్న మళ్లీ సీఎం అవ్వాల్సిన అవసరం ఉంది అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa