సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ.... సామాన్యుడైన నన్ను జగనన్న నాయకుడిగా చేశారు. పామర్రు ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీతో గెలిచాడంటే అందుకు కారణం వైయస్సార్సీపీ కుటుంబసభ్యులే. గతంలో మైనార్టీలను చులకనగా భావిస్తే, ఈరోజు జగనన్న నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని అక్కున్న చేర్చుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కాపు, ఓసీలను జగనన్న ఆదుకున్నారు. కులాలు, మతాలు చూడకుండా పరిపాలిస్తున్న జగనన్న. ఈ నాలుగేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు డీబీటీ ద్వారా పామర్రు నియోజకవర్గానికి రూ.799 కోట్లు డైరెక్ట్గా ఇచ్చిన జగనన్న. గతంలో పెన్షన్రావాలంటే పెద్దమనిషి వద్దకెళ్లి నమస్కారం పెడితేనే ఇచ్చేవాళ్లు. కానీ ఈరోజు జగనన్న కులాలు, మతాలు, రాజకీయం చూడట్లేదు. గతంలో పంచాయతీ ఆఫీసుల వద్ద పడిగాపులుగాస్తే వచ్చే పింఛన్లు.. నేడు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటికే వస్తున్నాయి అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa