చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో వై ఏపీ నీడ్స్ జగన్ బుక్ను ఎమ్మెల్సీ భరత్ విడుదల చేసారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా విప్లవాత్మక పరిపాలనతో చేసిన మంచిని వివరించడంతోపాటు అధికారంలో ఉండగా చంద్రబాబు – పవన్ కళ్యాణ్ జోడీ చేసిన మోసాలను గుర్తు చేయడమే లక్ష్యంగా చేపట్టిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం గురువారం 26 జిల్లాల్లో 660 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో భారీ జనసందోహం, జగన్నినాదాల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్సార్సీపీ నియోజకవర్గాల ఇన్చార్జ్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు, గృహ సారథులు, కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు, సీఎం జగన్ అభిమానులు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొన్నారు.మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడి నేతృత్వంలో ప్రజాప్రతినిధులు మధ్యాహ్నం గ్రామ సచివాలయాల వద్దకు చేరుకోగానే సర్పంచులు, సచివాలయ ఉద్యోగులు, గ్రామ ప్రజలు సాదరంగా స్వాగతం పలికారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా గ్రామానికి చేసిన మంచిని గణాంకాలతో సహా వివరించేలా సంక్షేమ బోర్డును ఆవిష్కరించారు. అనంతరం భారీ జనసందోహం మధ్య గ్రామ ప్రధాన కూడళ్లలో వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించి నేతలు ప్రసంగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa