టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కడప జిల్లా బద్వేల్ ఎస్సీ నియోజకవర్గ ఇంఛార్జ్గా బొజ్జ రోశన్నను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. పోరుమామిళ్ల పట్టణంలోని గిరినగర్కు చెందిన ఈయన నంద్యాల జిల్లాలో సాగునీటిపారుదలశాఖ డీఈఈగా పనిచేస్తూ ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీ క్రియాశీలకంగా ఉన్నారన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బొజ్జ రోశన్నను ఇంఛార్జ్గా ప్రకటించారని బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ యువనేత రితేష్రెడ్డి తెలిపారు. బొజ్జ రోశన్న నియామకంతో పోరుమామిళ్ల పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఇప్పటికే బొజ్జ రోశన్న నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇప్పటికే రోశన్నను పార్టీ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఆమె కుమారుడు రితేష్రెడ్డి అంతర్గతంగా నియోజకవర్గ నేతలకు సమాచారం అందించారు. ఆ వెంటనే ఆయన తెలుగుగంగ విభాగంలో కర్నూలులో డీఈ ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు. ఆ వెంటనే రాజీనామాను ఆమోదించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే చంద్రబాబు దగ్గర విజయమ్మ ప్రస్తావించగా ఆమోదం తెలిపారు. తాజాగా అధికారికంగా ప్రకటించారు. దివంగత మాజీ మంత్రి వీరారెడ్డికి రోశన్న అత్యంత సన్నిహితుడుగా పేరుంది. బద్వేల్ టీడీపీ నేత డా.ఓబుళాపురం రాజశేఖర్కు అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తూ తగు న్యాయం చేస్తుందని విజయమ్మ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa