ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైనారిటీల విషయంలో జగన్ మాట తప్పాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 13, 2023, 01:00 PM

మైనారిటీలను మోసం చేసిన ఘనత జగన్ కె దక్కిందని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్‌ ఉపాధ్యక్షుడు మిర్జా మాజేద్‌ రజా ఆరోపించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ....  ఎన్నికలముందు మైనారిటీలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక నూతనంగా ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకపోగా గతంలో ఉన్న వాటిని తుంగలో తొక్కి ఈ రోజు కేవలం షాదీ తోఫా మాత్రమే ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి దుల్హన్‌ పథకం కొనసాగిస్తామని టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.50 వేలు ఇస్తారని, మేము లక్ష రూపాయలు ఇస్తామని చెప్పిన హామీ నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa