తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమారుడి గుండె ఆగింది. అమ్మ చనిపోయిన రెండు గంటలకే కొడుకు కూడా ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పంటు రేవు ప్రాంతానికి చెందిన కిరాణా వ్యాపారి కార్మూరి వెంకటరత్నం, అలివేలు మంగతాయారు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కవల మగపిల్లలు. అలివేలు మంగతాయారు మంగళవారం ఉదయం అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను చికిత్స నిమిత్తం కుమారుడు లక్ష్మణకుమార్, కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మంగతాయారు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తల్లి మృతి గురించి తెలియగానే లక్ష్మణకుమార్ తీవ్ర కలత చెందారు. రెండు గంటల వ్యవధిలోనే గుండెపోటుతో కుప్పకూలాడు.. ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు. గంటల వ్యవధిలో తల్లీకుమారులు మృతిచెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. లక్ష్మణకుమార్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లక్ష్మణకుమార్కు తల్లిదండ్రులంటే ప్రేమని, గౌరవమర్యాదలని స్థానికులు చెబుతున్నారు. ఏ విషయంలోనైనా అమ్మానాన్నల అనుమతి తప్పనిసరిగా తీసుకునే వారన్నారు. ఇప్పుడు తల్లి మరణాన్ని తట్టుకోలేక లక్ష్మణకుమార్ చనిపోవడం విషాదాన్ని నింపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa